21, డిసెంబర్ 2015, సోమవారం

కాకతీయులు కమ్మవారే

కాకతీయులు-దుర్జయ వంశస్థులు కాకతీయులు పరాక్రమముతో, వీరశూరత్వం కనబరచి శత్రువులకు సింహ స్వప్నమై , పరిపాలించినవారు, రాజ్యాన్ని సుభిక్షం చేసిన ఘనులు ,ప్రజాశ్రేయోభిలాషులు, దానధర్మవారులు.ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయులు కమ్మవారు.కమ్మవారేనా అని సందేహం వక్రబుద్ధి కలిగినవారికి కలుగుతుందేమో కాని , కాదు అనేందుకు మాత్రం ఆధారాలు శూన్యం. కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్నయ.జైన,బౌద్ధ మతాలు ఆచరించటం వలన ఎలాంటి వంశం పేరును వారు ప్రస్తావించలేదు, కాని ఆయన తదనంతరం 12వ శతాబ్దం అంతమున పరిపాలించిన కాకతీయ భూపతి మహాదేవరాజు కమ్మప్రభువని , వీరి వంశం దుర్జయ అని,వర్ణము శూద్రమని చేబ్రోలు ,మోటుపల్లి ,పాకాల శాసనాలలో వ్రాయబడినది.మహాదేవుని కూతురు మైలమదేవి,కొడుకుగణపతిదేవుడు. మైలమదేవి కమ్మవనితని,ఆమెను నతవాటి దుర్జయ వంశానికి చెందిన రుద్రుడు వివాహమాడాడని ఒక శాసనములో పేర్కొనబడినది.వారి కుమారుడే మాధవవర్మ , కూతురు బయ్యలదేవి.మాధవవర్మ కమ్మ ప్రభువని ఒక కన్నడ గ్రంథం నుండి ఇటీవల బయటపడినది.

9 కామెంట్‌లు:

  1. Exactly.......కాకతీయులు-దుర్జయ వంశస్థులు..........శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

    గూడూరు శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.

    చేబ్రోలు శాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.

    రిప్లయితొలగించండి
  2. దుర్జయ వంశస్థులు:-
    1) బయ్యారం శాశనం ప్రకారం ఇతను కాకతీయ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. ఇతను కాకతిపురం అను ప్రాంతం నుండి పరిపాలన సాగించినాడు.2) జాయప నాయుడు - కమ్మ దుర్జయ వంశము:-జాయప నాయుడు లేక జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.3)మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ - కమ్మ దుర్జయ వంశము, కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు.గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.సాగి వారిది దుర్జయ వంశము-విప్పర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య చౌదరి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు.గన్నమ నాయుడు ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.

    రిప్లయితొలగించండి
  3. 4) ముసునూరి నాయకులు - కమ్మ దుర్జయ వంశము
    కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు కమ్మ దుర్జయ వంశము చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము విజయనగర రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. ఆంధ్రచరిత్రలో ముసునూరివారి పాలనము 50 వర్షములు మాత్రమేఐనను అది వారి త్యాగనిరతికి, తెలుగువారి ఐక్యతకు కాణాచి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.

    రిప్లయితొలగించండి
  4. """కమ్మ ప్రభువులు,దుర్జయ వంశము""".............................

    కమ్మ క్షత్రియ జాతికి చెందిన
    ఒక ప్రాచీన తెగ "దూర్జయులు". వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.......

    చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
    క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు.......
    ###"""""ప్రధాన కమ్మ రాజ వంశాలు - రాజ్యాలపరంపర కమ్మనాయకరాజులు"""""####.....................................
    1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
    2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
    3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
    4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
    5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
    6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
    7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
    8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
    9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
    10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

    రిప్లయితొలగించండి
  5. సూర్యచంద్ర వంశాలు అంతరించిన తరువాత 16 షాడోమహాజన ఆర్య క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షేత్రీయ జాతి ఒకటి ఆ ఖంభోజా నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ సత్తాబ్డం ఈ కలంలో ఈ ప్రాంతాన్ని కమ్మరాష్ట్రం కమ్మనాడుగా పిలిచెవారు కమ్మనాడు ని పాలించే వారిని కమ్మప్రభులుగా పిలిచేవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో కమ్మవారి దుర్జయ వంశపు రాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ కమ్మదుర్జయ వంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె పెమ్మసాని సాయపనేని రావెళ్ల సూర్యదేవర వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావున కమ్మవారు కాంబోజ ఆర్యులు కమ్మక్షత్రియులు అని తెలుసుకొండి.

    రిప్లయితొలగించండి
  6. Kammas were dujayas. There are many Kamma Durjaya kingdoms. Few of them are kakatiya, velnati choda,musunuri, Pemmasani and many more basically Kammas were kshatriyas. From 3rd century ago we knew kammarastram, kammaratham, kammanadu areas those who ruled these places they were called as Kamma prabhuvulu.

    రిప్లయితొలగించండి
  7. బౌద్ధ మతానికి కమ్మ కులానికి సంబందం లేదు.అది ఈ మధ్య కాలములో పుట్టుకొచ్చిన కల్పన.

    రిప్లయితొలగించండి
  8. కాకతీయులు యాదవులు అని పరబ్రహ్మశాస్త్రిగారు నిరుపించినారు.వారి కాకతీయులు గ్రంధం చదవండి.దుర్జయ వంశస్తులు అంటే కమ్మవారని గాదు.చరిత్రలో ఎక్కడైనావ్రాసినారా.?అధారాలు చూపండి. జాయపసేనాని వాళ్ళు యాదవులు అంటానికి వారి దివిసీమ,బెజవాడ మల్లిఖార్జున ్ ఆలయం శాసనాలుఆధారం.దుర్జయవంశస్తులూని చెప్పుకున్నవారు ఎవరైన మేము కమ్మ కులస్తులమని చెప్పిన ఆధారాలు ఉన్నాయా?ఆనాడు క్షత్రియులు,శూధ్రూలు కూడా తాము దుర్జయులమని చెప్పుకున్నారు. రెడ్డి కులస్తులుకూడా దుర్జయులమని చెప్పుకున్నారు.కాకతీయులకి కమ్మకులస్తులకి ఏ సంబందం లేదు.స్పష్టమైన చారిత్రక ఆధారాలు చూపి నీరుపిస్తే బాగుంటుంది. కేవలం మీ కల్పనను ఆధారంగా పరిగనించరు. కాకతీయులు బలిజని, మాలవారని ,బోయవారని,ముదిరాజులని ఎవరికివారు మీలాగనే కధనాలను వ్రాస్తున్నారు.మీది కరక్టు అయితే వారిది కరక్టు అవ్వాలి.
    జాయప సేనానింతమిలనాడుకు చెందినవారు.అయ వంశంకు చెందినవారు. అయ వంశం తమిళ గొల్ల కులానికి చెందిన వారు.చోళుల ఉద్యొగులుగా తెలుగు ప్రాంతానికి వచ్చినవారు.

    రిప్లయితొలగించండి